MDK: వెంకటాపూర్ (పిటి) నుంచి తూప్రాన్ పట్టణానికి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై టిప్పర్ యజమాని శ్రీనివాస్ గౌడ్, డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు SI గంగరాజు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
టిప్పర్ సీజ్.. ఇరువురిపై కేసు


