SKLM: ఎల్ఎన్.పేట మండల కేంద్రం రోటరీ నగర్లో రెండు వారాలుగా నీటి కుళాయిలు పని చేయకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జల జీవన మిషన్ ద్వారా వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటార్ పని చేయకపోవడంతో నీటి కష్టాలు తప్పడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు .
ఆంధ్రప్రదేశ్
రెండు వారాలుగా నిలిచిన తాగునీరు


