హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసులు.. ఫిర్యాదులతో వేడెక్కిన వర్ధన్నపేట రాజకీయాలు

WGL: వర్ధన్నపేటలో జాతీయ జెండా అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం ముదురుతోంది. జెండాను అవమానించారన్న ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌తో పాటు 25 మంది బీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రతిగా రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో రాజకీయ వేడెక్కింది.