హైదరాబాద్: 28°C
వార్తలు

బోర్డింగ్‌ పాస్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టుల వద్ద బోర్డింగ్‌ పాస్‌లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ మేరకు బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ నిబంధనను ఎత్తివేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.