అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును పూర్తిగా మార్చేశాయని కేంద్రమంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇప్పుడు వ్యాపార సంబంధాలు కేవలం విశ్వాసంపైనే ఆధారపడట్లేదని వ్యాఖ్యానించారు. నమ్మకం ఒక్కటే వ్యాపారానికి పనిచేయదన్నారు. ఎకనమిక్ టైమ్స్ ప్రపంచ నాయకుల సదస్సులో ప్రసంగించిన జైశంకర్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కన్పించట్లేదని చెప్పారు.
వార్తలు
ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కన్పించట్లేదు: జైశంకర్


