హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం

PLD: మాచవరం(M) కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బి.పి. గురవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 2023లో గొర్రెల విషయంలో నమోదైన ఘర్షణ కేసులో రాజీ పడాలని పోలీసులు మూడు రోజులుగా వేధిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.