PLD: పిడుగురాళ్లలో గుత్తికొండ సమీపంలో శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గుత్తికొండకు చెందిన కుంభా వెంకట్రావు(22) స్నేహితులతో కలిసి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకట్రావు మార్గమధ్యలో మృతి చెందాడు. జూన్లోనే కొత్త బైకు కొన్న యువకుడు మృతి చెందడంతో విషాదం అలుముకుంది.
ఆంధ్రప్రదేశ్
బావిలోకి బైకు దూసుకెళ్లి యువకుడు మృతి


