హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న రాయితీ బియ్యం పట్టివేత

HNK: హసన్‌పర్తిలో అక్రమంగా తరలిస్తున్న 84 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హసన్‌పర్తి నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న రెండు ట్రాలీ ఆటోలను తనిఖీ చేయగా 200బస్తాల్లో బియ్యం లభ్యమైంది. భాను,సంపత్‌లను అరెస్టు చేసి, రెండు వాహనాలతో పాటు రూ. 2.94 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు.