GNTR: రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి బోసురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల వారికి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యలపై మంత్రికి అర్జీలు


