హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో రోబో డాగ్ పహారా‌

TPT: భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు TTD ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 కాళ్ల క్వాడ్రుపెడ్ రోబో డాగ్ పనితీరును అదనపు EO వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, 360° లైడార్, AI సెన్సర్లతో కూడిన ఈ రోబోట్ చీకటి, పొగమంచులోనూ జంతువులు, మనుషులను గుర్తించగలదు. అడవుల్లో చిరుతల కదలికలను గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వనుంది.