హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యలపై షేక్ నూరి ఫాతిమా పరిశీలన

గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా బి.ఆర్. స్టేడియం సమీపంలోని మంచినీటి ట్యాంకులతో పాటు ముఫ్తీ మొహల్లా (నందు పరేడ్) ప్రాంతాలను ఆమె సందర్శించారు.