కోనసీమ: మామిడికుదురు మండలం నగరం మెయిన్ రోడ్లో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గెడ్డం రామారావు కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఉండటంతో ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు బీరువాలను బద్దలు కొట్టి సామాన్లను చెల్లాచెదురు చేశారు. శుక్రవారం ఉదయం పనిమనిషి గుర్తించి యజమానులకు సమాచారం అందించింది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నగరంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం


