హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేవీ లైన్‌కు అడ్డుగా చెట్లు

ASR: రాజవొమ్మంగి–నర్సీపట్నం మార్గంలోని 33 కేవీ విద్యుత్‌ లైన్‌కు చెట్లు, తీగలు అడ్డుగా పెరిగాయి. విద్యుత్‌ తీగలకు కొమ్మలు తాకే స్థాయికి చేరడంతో ఈదురుగాలుల సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తీగలు తెగి నేలపై పడితే ప్రజలు, పశువులకు ప్రాణహాని పొంచి ఉంది. అధికారులు స్పందించి లైన్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.