అన్నమయ్య: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. A1 గంగాధర్, A3 అబ్బవరం శివరాం ప్రసాద్లకు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా కూడా విధిస్తూ ఈ నెల 18న తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తు, విచారణలో పనిచేసిన పోలీసులను డీఎస్పీ కృష్ణమోహన్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు


