హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురం డిపో మేనేజర్‌గా ప్రేమ్ కుమార్

కోనసీమ: అమలాపురం ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా టి. ప్రేమ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. డిపో పరిధిలోని బస్సుల కండిషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బస్సులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయించి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.