హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరకాల సమస్యకు తెర.. డ్రైన్ నిర్మాణం షురూ

VKB: 19వ వార్డు సీతారాంపేట్‌లో గత 20 ఏళ్లుగా ఉన్న మురుగునీటి సమస్య పరిష్కారానికి సీసీ డ్రైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ప్రారంభించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానికుల చిరకాల నిరీక్షణకు తెరపడింది.