HYD: కళ్యాణలక్ష్మి పథకం ద్వారా సబ్బండ వర్గాల ఆడపిల్లలకు ఎంతో లాభం చేకూరుతుందని బీఆర్ఎస్ మహిళా నాయకులు తెలిపారు. హబ్సిగూడలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హబ్సిగూడలో కళ్యాణలక్ష్మిపై డిమాండ్


