MLG: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వాజేడు మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెనుమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్న పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయొద్దన్నారు. పథకాలను కొనసాగించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: "కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలి"


