KMM: అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఇసుకవాగు సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం తల, మొండెం వేరుగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి


