హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీ గడ్డపై శ్రీకాకుళం తల్లీకొడుకులు మ్యాజిక్..!

SKLM: వియత్నాంలో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లి, కుమారుడు పతకాలు సాధించారు. రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష పూమ్‌సే విభాగంలో స్వర్ణ పతకం గెలవగా, ఆమె తనయుడు కారే మోక్షిత్ క్యాడెట్ విభాగంలో రజత పతకం సాధించారు. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన ఈ పోటీల్లో కొమర మోహనకృష్ణ వీరికి కోచ్‌గా వ్యవహరించారు.