హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలను పరిష్కరించండి'

PLD: నరసరావుపేట శివ సంజీవయ్య కాలనీలో మురుగు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు కాలనీలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. మురుగు కాలువలు సక్రమంగా లేక మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, వర్షాలకు ఇళ్లలోకి మురుగునీరు చేరుతోందని స్థానికులు తెలిపారు.