హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఐటీడీఏ గ్రీవెన్స్‌కు తప్పనిసరిగా హాజరు కావాలి'

PPM: సీతంపేట ITDAలో సోమవారం నిర్వహించే PGRSకు అన్ని శాఖల అధికారులు ఉ. 9 గం.కే హాజరు కావాలని ITDA PO పవార్‌ స్వష్నిల్‌ ఆదివారం సూచించారు. ప్రజలు తమ సమస్యలతో కార్యక్రమానికి వచ్చేసరికి అధికారులు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ మేరకు తాను ఉ.9 నుంచి 11 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.