SKLM: మందసలో ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. బస్టాండ్లో నిందితుడు యువతిని తనతో రావాలనగా నిరాకరించినందుకు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనలో యువతి చేతికి గాయాలయ్యాయి. హరిపురం సీహెచ్సీలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని మందస పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ పేరుతో యువతిపై బ్లేడుతో దాడి


