హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

ఏలూరు దక్షిణపు వీధిలోని పాత వేరుశనగ ఫ్యాక్టరీ గ్రౌండ్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు ఆదివారం దాడి చేశారు.ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,880 నగదుతో పాటు పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు