హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా: పవన్

TPT: ఎర్రావారిపాలెం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో నిఘా, అటవీ సమీప గ్రామాల్లో రాత్రి గస్తీ పెంచాలని సూచించారు. రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో హెచ్చరికలు జారీ చేసి, అవసరమైన చోట H.A.N.U.M.A.N. బృందాలను మోహరించాలని ఆదేశించారు.