NRML: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అటల్ జీ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వాజ్పేయి రాజనీతిజ్ఞుడే కాకుండా కవి, దార్శనికుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అటల్ జీకి ఎమ్మెల్యే ఘన నివాళి


