హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాజ్‌పేయికి బీజేపీ నేతల నివాళి

SRCL: కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అజ్మీర తండా సర్పంచ్ అజ్మీర జయరాం, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజ్‌పేయి సేవలను నాయకులు స్మరించుకున్నారు.