KMR: పెద్దకొడపగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీఓ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం కార్యాలయంలో ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ప్రతి సోమవారం ప్రజావాణి '


