హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆరుగురు యువకులు.. రూ.1.87లక్షలతో దేశంలో మార్పు

HCL సహ వ్యవస్థాపకుడు అజయ్‌ చౌధ్రీ ఎక్స్‌ వేదికగా నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 1976లో ఆరుగురు యువకులు రూ.1.87 లక్షలతో ఢిల్లీలో హెచ్‌సీఎల్‌ను ఎలా ప్రారంభించారో చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు వదిలి, తయారీ లైసెన్స్‌ లేకపోయినా సాంకేతికతపై నమ్మకంతో ముందుకు సాగి, భారత్‌లో తొలి కంప్యూటర్ల తయారీ సంస్థగా ఎదిగిన అద్భుత ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.