హైదరాబాద్: 28°C
వ్యాపారం

డౌన్‌స్ట్రీమ్‌ పెట్టుబడులకు మినహాయింపు

FDI నిబంధనల సరళీకరణలో భాగంగా పరోక్ష(డౌన్‌స్ట్రీమ్‌) పెట్టుబడుల ఆమోద ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదంతో విదేశీ పెట్టుబడులు పొందిన భారతీయ సంస్థలు, తిరిగి డౌన్‌స్ట్రీమ్‌ పెట్టుబడులు పెడితే మళ్లీ కొత్తగా అనుమతులు తీసుకోనక్కర్లేకుండా మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనిద్వారా ఆమోద ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.