హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌ గాయంపై బీసీసీఐ అప్‌డేట్

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శ్రీలంకతో వార్మప్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో కుడి బొటనవేలికి గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా తొలి రోజు మ్యాచ్‌కు అతడిని బీసీసీఐ దూరంగా ఉంచింది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. 'బీసీసీఐ వైద్య బృందం నిరంతరం గిల్‌ గాయంపై పర్యవేక్షిస్తోంది' అని బీసీసీఐ పేర్కొంది.