కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన ప్రీతి పవార్ అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాన్ని లాంఛనప్రాయం చేసింది.
క్రీడలు
ఫైనల్లో ప్రీతి.. పతకం ఖాయం


