హైదరాబాద్: 28°C
క్రీడలు

మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు

టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్‌ చౌహాన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ.15 లక్షలకు పైగా మోసం చేశారనే ఆరోపణలతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన చౌహాన్.. ఇది కేవలం వ్యాపార వివాదమేనని, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తానని తెలిపాడు. కాగా, భారత్ తరఫున అతడు 21 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు.