హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎట్టకేలకు వికెట్‌ తీసిన టీమిండియా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌కు తొలి వికెట్ లభించింది. ప్రమాదకరంగా మారిన ఓపెనింగ్ భాగస్వామ్యానికి ప్రసిద్ధ్‌ కృష్ణ బ్రేక్ వేశాడు. 30.1 ఓవర్‌లో 91 పరుగులు చేసిన ఓపెనర్ జాకబ్‌ బెతెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 192 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. బెన్‌ డకెట్ (89*), జో రూట్‌ (0*) క్రీజులో ఉన్నారు.