హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌కు వన్‌ప్లస్ గుడ్‌బై.. క్లారిటీ

భారత్‌కు వన్‌ప్లస్ గుడ్‌బై చెబుతుందంటూ వస్తున్న వార్తలను వన్‌ప్లస్ ఇండియా ఖండించింది. భారత మార్కెట్‌లలో తమ వ్యాపారం ఎప్పటిలానే కొనసాగుతుందని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని కోరింది. సొంత బ్రాండ్‌గా మొదలైన వన్‌ప్లస్.. ఇతర కంపెనీల పోటీతో తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలోనే యూరప్, అమెరికాలకు సంస్థ గుడ్‌బై చెప్పింది.