హైదరాబాద్: 28°C
క్రీడలు

జయ్ షాకు గిల్ స్పెషల్ రిక్వెస్ట్

టీ20 లీగ్‌ల హవా పెరుగుతున్న నేపథ్యంలో, వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం తేవాలని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ఛైర్మన్ జయ్ షాకు విజ్ఞప్తి చేశాడు. ఇకపై సాధారణ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లకు బదులుగా.. ముక్కోణపు లేదా నాలుగు దేశాల సిరీస్‌లను నిర్వహించాలన్నాడు. దీనివల్ల వన్డేలపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుందన్నాడు.