హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి పెరిగిన చమురు ధర

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మరోసారి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర 4 శాతం ఎకబాకింది. దీంతో బ్యారెల్ ధర 79.26 డాలర్లకు చేరింది. హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై IRGC దాడి చేయడంతో ప్రతిగా ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. దీంతో బహ్రెయిన్, కువైట్‌లోని అగ్రరాజ్య బేస్‌లను టెహ్రాన్ మళ్లీ టార్గెట్ చేయడంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి.