హైదరాబాద్: 28°C
క్రీడలు

సలీమా సారథ్యంలో ఆసియా క్రీడలకు

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు సలీమా సారథ్యం వహించనుంది. సెప్టెంబర్ 19న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ మెగా క్రీడల్లో పోటీపడే 20 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఈ క్రీడల్లో పసిడి గెలవడం ద్వారా 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని భారత్ భావిస్తోంది. ఇటీవల FIH నేషన్స్ కప్‌లో సలీమా సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచింది.