హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ధర్నా

పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు "చలో కలెక్టరేట్" ధర్నా నిర్వహించారు. కొత్త యాప్‌లతో పనిభారం పెరిగిందని, జీతాలు పెంచకుండా అదనపు పనులు అప్పగించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయింపు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.