హైదరాబాద్: 28°C
వార్తలు

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలపై 23 వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న MLA ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.