కృష్ణా: పెడనలో ఓటర్ల నమోదు ప్రక్రియపై తహసీల్దార్, ఏఈఆర్ఓ వహీదా రెహానా శుక్రవారం కీలక సూచనలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ జూలై 14తో ముగుస్తున్నందున, ఓటర్లు తమ ఫారాలను పూర్తి వివరాలతో నింపి బీఎల్వోలకు అందజేయాలని కోరారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ను సరిచూసుకొని, అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోకుండా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ఓటర్ల నమోదుకు జూలై 14 చివరి తేదీ


