కువైట్లో అదృశ్యమైన తెలంగాణ యువకుడు కైలాశ్ (30) ఎడారిలో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా కోరట్పల్లి తండాకు చెందిన కైలాశ్ కువైట్లో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. జేసీబీ మరమ్మతుల సమయంలో ప్రమాదవశాత్తు అతను చనిపోగా, భయంతో నిందితులు సాల్మి ఎడారిలో పూడ్చిపెట్టారు. ప్రధాన నిందితుడు స్వగ్రామానికి రాగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
కువైట్ ఎడారిలో తెలుగు యువకుడి మృతదేహం


