AP: అనంతపురం జిల్లా పులకుర్తిలో జూన్ 23న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధారాల్లేని ఈ కేసులో సగం కాలిన కన్నడ పేపర్, అప్పడాల ప్యాకెట్ ఆధారంగా మృతుడు బళ్లారికి చెందిన గురురాజ రావు (మూగ, చెవిటి) అని గుర్తించారు. ATM ఫుటేజ్, సైగల విశ్లేషణతో నిందితులు బసవరాజు, కొట్రేష్ అని తేల్చారు. నిందితులు కూడా మూగ, చెవిటి వారే కావడం గమనార్హం.
వార్తలు
అప్పడాల ప్యాకెట్తో హత్య కేసు ఛేదన


