హైదరాబాద్: 28°C
వార్తలు

బాలికపై హత్యాచారం..నిందితుడి ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌ బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసుల తుపాకీ లాక్కొని తప్పించుకునేందుకు కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు చనిపోయాడు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎం సువేందు అధికారి డీజీపీని ఆదేశించారు.