హైదరాబాద్: 28°C
వార్తలు

'రాయలసీమ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లండి'

కర్నూలులో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు కలిసి రాయలసీమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, శ్రీబాగ్ ఒప్పందం అమలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని కోరగా, బండారు దత్తాత్రేయ సానుకూలంగా స్పందించినట్లు రాయలసీమ రవికుమార్ తెలిపారు.