కరూర్ తొక్కిసలాటపై డీఎంకే వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా.. బహిరంగ ప్రకటనలు చేయకుండా విజయ్ను నిరోధించాలని డీఎంకే విజ్ఞప్తి చేయడంపై మండిపడింది. సీఎం పర్యటనలను తాము నియంత్రించాలా? అని ధ్వజమెత్తింది. దేశంలోని పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.
వార్తలు
డీఎంకే వేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం


