హైదరాబాద్: 28°C
వార్తలు

రాంపల్లి కాలనీలో 100 సీసీటీవీ కెమెరాల ప్రారంభం

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ కాలనీలో 'మీ సురక్ష- నేను సైతం 2.0'లో భాగంగా 100 సీసీటీవీ కెమెరాలను సీపీ సుమతి ప్రారంభించారు. ఈ కెమెరాలు 52 బ్లాక్స్‌లోని 6,240 ఫ్లాట్స్‌ను కవర్ చేస్తాయి. ప్రజల భాగస్వామ్యంతో భద్రతను పెంపొందించడం, నేరాల నివారణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. దీనివల్ల కాలనీ వాసులకు మరింత రక్షణ చేకూరుతుంది.