హైదరాబాద్: 28°C
వార్తలు

హర్మూజ్‌ దాటి.. భారత్‌కు ఎరువుల నౌకలు

హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా 15 నుంచి 20 వరకు భారత ఎరువుల నౌకలు దాటాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో 8 నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియాను, 4 నౌకలు 2.57 లక్షల టన్నుల DAPని, 3 నౌకలు 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌ను తీసుకువస్తున్నాయని తెలిపింది. మరో 5 నౌకలు వీటితో చేరనున్నాయని చెప్పింది. కొంతకాలంగా హర్మూజ్‌లో సమస్య ఉన్న ఎరువుల లభ్యతకు ఆటంకం లేకుండా కేంద్రం చూస్తుంది.