కోడలిపై మామ అత్యాచారం చేసిన ఘటన యూపీ లక్నోలో జరిగింది. రైల్వేలో ఇంజనీర్గా పని చేస్తున్న 58 ఏళ్ల వ్యక్తి తమ కుమారుడికి 2023లో వివాహం చేశాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తవారింటికి రాగా ఆమెకు మద్యం తాగించి మామ అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మామను అరెస్ట్ చేశారు.
వార్తలు
కోడలిపై మామ అత్యాచారం


