రామ భక్తులకు అయోధ్య రామ తీర్థ్ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ బహిరంగ లేఖ రాశారు. రామమందిరం కానుకలు చోరీ కావడం బాధాకరమన్నారు. పర్యటనలకు ట్రస్ట్ నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని.. అన్ని ఖాతాలు ఆడిట్తో భద్రంగా ఉన్నాయని చెప్పారు. విరాళాలన్నీ బ్యాంక్ ద్వారానే స్వీకరించామని.. కానుకల లెక్కింపులో తన పాత్ర ఏమీ లేదని వెల్లడించారు. SBI SOP ప్రకారమే కానుకల లెక్కింపు జరిగిందని తెలిపారు.
వార్తలు
భక్తులకు రామ తీర్థ్ ట్రస్ట్ కోశాధికారి లేఖ


